భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము గారు మంగళవారం విశాఖపట్నం చేరుకున్నారు. ‘ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ’ (IFR) కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమెకు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ మరియు ఇతర ఉన్నతాధికారులు రాష్ట్రపతికి సాదరంగా స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె నౌకాదళ విన్యాసాలను తిలకించనున్నారు.
