AP:రాపూరు మల్లమ్మ గుంట శివాలయం కల్యాణం

February 18, 2026 6:08 PM

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రాపూరు పంచాయతీ పరిధిలోని మల్లమ్మ గుంట శివాలయంలో ఆది దంపతుల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. మండల వేద పండితులు నాగరాజ స్వామి ఆధ్వర్యంలో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఈ వేడుకను నేత్రపర్వంగా నిర్వహించారు.

ఈ కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. కార్యక్రమం అనంతరం నాగరాజ స్వామి శివ పార్వతుల కల్యాణ విశిష్టతను భక్తులకు వివరించారు. భక్తులందరికీ తీర్థప్రసాదాల వితరణ చేపట్టారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media