AP:శ్రీకాకుళంలో వైభవంగా శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థ స్నానం!

February 19, 2026 10:48 AM

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగంలో శివరాత్రి ఉత్సవాలు పరాకాష్టకు చేరాయి. బుధవారం వంశధార నదీ తీరాన చక్రతీర్థ స్నానం అత్యంత వైభవంగా జరిగింది.

ఉదయం 11:30 గంటలకు పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను నంది వాహనంపై అధిష్టింపజేసి, వేదమంత్రాల నడుమ మిరియాబెల్లి రేవుకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ‘శివోహం’ నినాదాలతో వంశధార తీరం ప్రతిధ్వనించింది. సుమారు 4 లక్షల మంది భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఒడిశా, ఏపీలోని వివిధ జిల్లాల నుండి భక్తులు తరలిరావడంతో కిలోమీటర్ల మేర జనజాతర కనిపించింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media