సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గ పర్యటనలో మరోసారి తనదైన శైలిలో సందడి చేశారు. లేపాక్షి మండలం మానేపల్లి నుండి గౌరిగానపల్లి వరకు రూ. 2.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటీ రహదారి పనులకు ఆయన భూమి పూజ చేశారు.
భూమి పూజ అనంతరం బాలయ్య అందరినీ ఆశ్చర్యపరుస్తూ జేసీబీ (JCB) ఎక్కారు. స్వయంగా జేసీబీని డ్రైవ్ చేస్తూ రోడ్డు పనులను ప్రారంభించారు. బాలయ్య జేసీబీ నడుపుతున్న దృశ్యాలను చూసి కార్యకర్తలు, అభిమానులు కేరింతలు కొట్టారు. అంతకుముందు నియోజకవర్గానికి చేరుకున్న ఆయనకు తెలుగుదేశం మరియు కూటమి నాయకులు ఘనస్వాగతం పలికారు. నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎప్పుడూ ముందుంటానని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.
