AP: రాపూరు గురుకుల పాఠశాలలో ITDA అధికారిణి తనిఖీ

March 5, 2026 10:43 AM

నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను K. Sujatha ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ K. Christiana Jyothi ఆమెకు స్వాగతం పలికారు.

పర్యటనలో భాగంగా పదవ తరగతి విద్యార్థినులతో మాట్లాడిన ప్రాజెక్ట్ అధికారిణి, వార్షిక పరీక్షలకు ఒత్తిడి లేకుండా సిద్ధమవ్వాలని సూచించారు. అనంతరం పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.అలాగే పాఠశాల రికార్డులు, హాస్టల్ గదులు, స్టోర్‌రూమ్‌ను పరిశీలించారు. Swachh Andhra Mission కింద నిర్మితమవుతున్న మరుగుదొడ్ల పనులను కూడా ఆమె పర్యవేక్షించారు.పాఠశాల పరిశుభ్రత, విద్యార్థుల క్రమశిక్షణ మరియు హాజరు నిర్వహణపై ప్రిన్సిపాల్ మరియు సిబ్బందిని ఆమె అభినందించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media