Kamareddy మున్సిపాలిటీలోని 38వ వార్డు ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదయ్యాయని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి Ranga Madhavi Ramesh ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాను కేవలం మూడు ఓట్ల తేడాతో ఓడిపోయినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉండి తమ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓ మైనారిటీ నేత ప్రచారం నిర్వహించారని ఆరోపించారు.ఇతర ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు 38వ వార్డులో దొంగ ఓట్లు వేసినట్లు, కొంతమంది ఇతర వార్డుల్లో ఓటు వేసి మళ్లీ ఇక్కడ కూడా ఓటు వేశారని ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే న్యాయస్థానం మరియు ఎన్నికల కమిషన్ను ఆశ్రయించినట్లు వెల్లడించారు. అధికారులూ, ప్రజాప్రతినిధులు ఈ అంశంపై న్యాయం చేయాలని కోరారు.
