జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతిలోని Andhra Pradesh Secretariat లో ప్రత్యేక చేనేత స్టాళ్లను రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి S. Savitha ప్రారంభించారు.

ఈ స్టాళ్లలో వెంకటగిరి, గద్వాల్, ఉప్పాడ, ధర్మవరం, మంగళగిరి వంటి ప్రసిద్ధ చేనేత చీరలు, రెడీమేడ్ వస్త్రాలను 50 శాతం డిస్కౌంట్తో విక్రయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ స్టాళ్లు ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి.రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, నేతన్నలకు 365 రోజుల పాటు ఉపాధి కల్పించడమే లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. అలాగే ఏప్రిల్ 1 నుంచి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలు చేయనున్నట్లు వెల్లడించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన స్టాళ్లకు ఉద్యోగుల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

