Kadapa districtలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల స్వచ్చీకరణ మరియు రీ-సర్వే పనులను ప్రణాళిక ప్రకారం చురుగ్గా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ Sridhar Cherukuri రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

భూముల రీ-సర్వే, రెవెన్యూ క్లినిక్స్, పీజీఆర్ఎస్, మ్యూటేషన్స్, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ వంటి అంశాలపై రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.జిల్లాలో పెండింగ్లో ఉన్న రీ-సర్వే పనులను త్వరగా పూర్తి చేసి, మ్యూటేషన్ ప్రక్రియలో తప్పిదాలు లేకుండా పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాలని సూచించారు. భూ సమస్యలపై పీజీఆర్ఎస్ మరియు రెవెన్యూ క్లినిక్స్ ద్వారా వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
