చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పరిధిలోని గంగవరం మండలం వైఎస్సార్ జంక్షన్ వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న కారు ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఢీకొన్న తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.
