తిరుమలలో పలువురు ప్రముఖులు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తెలంగాణ ఎంపీ జి కృష్ణయ్య, మాజీ భారత క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, తమిళ సినీ నటుడు నీలగిరి రవి, ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ, సినీ నటి మిత్రావ్ శర్మ శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.


