మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ కేంద్రం కీలక నిర్ణయం

March 5, 2026 3:46 PM

వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఎండల్లో రేషన్ దుకాణాల వద్ద ఎక్కువసేపు వేచి ఉండకుండా ఉండేందుకు మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు ఏప్రిల్ నెలలోనే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకే విడతలో అందించనున్నారు. సాధారణంగా ప్రతి నెల రేషన్‌ను ఆ నెలలోనే అందిస్తారు. అయితే ఈసారి వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర పౌరసరఫరాల శాఖ ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకుంది.ఈ విషయంపై అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media