Gamalapadu గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇంచార్జ్ డీఎస్పీ Venkataramanaతో పాటు ఐదుగురు సీఐలు, పది మంది ఎస్సైలు పాల్గొన్నారు.
సరైన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలతో పాటు పలుగులు, గొడ్డళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గ్రామస్తులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల నివారణకు సహకరించాలని గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు.
