Rajahmundry రూరల్ పరిధిలోని బొమ్మూరు విద్యుత్ శాఖ స్టోర్స్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్క్రాప్ నిల్వ ఉంచిన గదిలో మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న పాత సామగ్రి, స్క్రాప్ పూర్తిగా దగ్ధమయ్యాయి.
అగ్నిప్రమాదం నేపథ్యంలో భద్రతా చర్యల భాగంగా బొమ్మూరు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ సరఫరాను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
