N. Chandrababu Naidu సోమవారం Nandyal districtలో పర్యటించనున్నారు. డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజు గ్రామంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నారు.

ఉదయం Amaravati నుంచి బయలుదేరి 11.20 గంటలకు కొత్తబురుజు గ్రామానికి చేరుకుంటారు. అనంతరం గ్రామ సభలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తారు. అలాగే స్థానిక రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు.తరువాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో పాల్గొని సాయంత్రం తిరిగి అమరావతికి చేరుకోనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు హెలిపాడ్ ఏర్పాట్లు చేశారు.

