Piduguralla పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) చెక్కులను గురజాల ఎమ్మెల్యే Yarapathineni Srinivasa Rao పంపిణీ చేశారు.

వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు బాసటగా 110 మంది లబ్ధిదారులకు రూ.1.13 కోట్లకు పైగా విలువైన చెక్కులు అందజేశారు. ఇందులో 95 చెక్కులు, 15 LOCలు ఉన్నాయి.ఇప్పటివరకు సీఎం సహాయ నిధి ద్వారా 723 మంది లబ్ధిదారులకు రూ.7.01 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
