Alamuru పోలీసులు సంచలన విజయం సాధించారు. Dr. B. R. Ambedkar Konaseema districtలో రాత్రివేళల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుల వద్ద నుంచి 203.650 గ్రాముల బంగారం, 765 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.32.40 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ Rahul Meena అభినందించారు.
