Bodhan పట్టణంలోని ఆచన్పల్లిలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో P. Sai Chaitanya పాల్గొన్నారు. అప్నా ఫంక్షన్ హాల్లో ముప్తి అతిక్ హైమద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది.

ఈ సందర్భంగా మౌలానా సయ్యద్ అబ్దుల్ బాకీ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో సీపీ పాల్గొని అనంతరం ఉపవాస విరమణ చేశారు. రంజాన్ మాసం కేవలం ఉపవాసాల కాలమే కాకుండా ఆత్మపరిశీలన, సహనం, క్రమశిక్షణ పెంపొందించే పవిత్ర సమయమని ఆయన పేర్కొన్నారు.సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని కోరుతూ అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
