Amaravatiలో ఎల్పీజీ కొరతపై వస్తున్న వార్తలపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి Nadendla Manohar స్పందించారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని, ప్రజలు అనవసర ఆందోళనకు గురికావద్దని ఆయన స్పష్టం చేశారు.
గృహ అవసరాలతో పాటు వాణిజ్య అవసరాలకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని తెలిపారు. గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు తరలకుండా జిల్లాల జాయింట్ కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
