New Delhiలో కూటమి ఎంపీల ఆత్మీయ సమావేశం సందడిగా జరిగింది. కేంద్ర మంత్రి Kinjarapu Ram Mohan Naidu తన నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి Nara Lokesh హాజరయ్యారు.

ఈ సందర్భంగా కూటమి ఎంపీలతో మంత్రి లోకేష్ ఆత్మీయంగా మాట్లాడారు. రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులను పలకరించి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే పెద్దమ్మగా భావించే Daggubati Purandeswari ఆశీర్వాదాలు కూడా స్వీకరించారు. సమావేశంలో ఎంపీలందరినీ పేరుపేరునా పలకరిస్తూ లోకేష్ సందడి చేశారు.

