నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద దేశంలోనే తొలి అటానమస్ మారిటైం షిప్ యార్డ్ మరియు సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఐటీ, విద్యాశాఖ మంత్రి Nara Lokesh శంకుస్థాపన చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో Sagar Defence Engineering Private Limited ఈ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయనుంది. మొదటి దశలో సుమారు రూ.45 కోట్ల పెట్టుబడి పెట్టి, వెయ్యి మందికి పైగా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద 29.58 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన కేటాయించారు.

ఈ కేంద్రం ద్వారా అటానమస్ షిప్ బిల్డింగ్, మెరైన్ ఇంజనీరింగ్, పరిశోధన మరియు అభివృద్ధి రంగాల్లో అవకాశాలు పెరగనున్నాయి. 2026 నవంబర్ నాటికి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ను మారిటైం రోబోటిక్స్ మరియు అటానమస్ షిప్ బిల్డింగ్ హబ్గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ Vemireddy Prabhakar Reddy, ఎమ్మెల్యేలు Somireddy Chandramohan Reddy, Pulivarthi Nani తదితరులు పాల్గొన్నారు.
