వాణిజ్య గ్యాస్ వినియోగంపై ఆంక్షలు విధించడంతో Visakhapatnamలో ఆతిథ్య రంగం గందరగోళంలో పడింది. గృహ వినియోగానికి ప్రాధాన్యత ఇస్తూ వాణిజ్య గ్యాస్ సరఫరాను తగ్గించాలన్న సూచనలతో హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
గ్యాస్ కొరత కారణంగా కొన్ని రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడగా, మరికొన్ని హోటళ్లు కట్టెల పొయ్యిలతో వంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో హోటల్ యజమానులు Swiggy మరియు Zomato వంటి ఫుడ్ డెలివరీ సంస్థలకు ఆహారం అందించలేమని నిర్ణయం తీసుకున్నారు. హోటళ్లలో బస చేసే అతిథులకు మాత్రమే భోజనం అందించనున్నట్లు హోటల్ అసోసియేషన్ తెలిపింది.గ్యాస్ ధరల పెరుగుదల, సరఫరా తగ్గుదలతో పర్యాటక రంగంపై కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. పర్యాటకుల సంఖ్య తగ్గితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గే ప్రమాదం ఉందని హోటల్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
