గుంటూరు జిల్లా Undavalli సమీపంలో Buckingham Canalపై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులను పురపాలక శాఖ మంత్రి P. Narayana పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ Seed Axis Roadను Mangalagiri రహదారికి అనుసంధానించే పనుల్లో ఇంకా 4.5 ఎకరాల భూసమస్య ఉందని తెలిపారు. రైతులు స్వచ్ఛందంగా భూసమీకరణకు ముందుకు రావాలని కోరుతూ మరో నెల రోజుల గడువు ఇస్తున్నామని చెప్పారు.ఏప్రిల్ 9లోపు రైతులు ముందుకు రాకపోతే భూసేకరణ ప్రక్రియను చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. బకింగ్ హామ్ కెనాల్పై స్టీల్ బ్రిడ్జ్ పనులు వేగంగా సాగుతున్నాయని, ఈ నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు.అదే విధంగా Guntur Channel మరియు Kondaveeti Vaguపై మరో రెండు స్టీల్ బ్రిడ్జ్లు నిర్మించనున్నట్లు చెప్పారు. ఈ బ్రిడ్జ్లు పూర్తయితే సీడ్ యాక్సిస్ రోడ్ ప్రాజెక్ట్ పూర్తవుతుందని మంత్రి తెలిపారు.
