కుటుంబ కలహాలు ఓ మహిళ ప్రాణాలు తీసిన విషాద ఘటన Rajampetలో వెలుగుచూసింది. భర్త ముందే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటుండగా అతడు అడ్డుకోకుండా వీడియో తీసిన ఘటన కలకలం రేపింది.
పోలీసుల సమాచారం ప్రకారం, బోయినపల్లి గ్రామానికి చెందిన శ్రీరామ్ శ్రీనివాస్ రైల్వేలో లోకో పైలట్గా పనిచేస్తున్నారు. ఆయన భార్య కృష్ణవేణితో తరచూ కుటుంబ కలహాలు జరిగేవని స్థానికులు తెలిపారు. గురువారం ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరగగా, ఆవేశంతో కృష్ణవేణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న భర్త ఆమెను అడ్డుకోవడమే కాకుండా ఘటనను సెల్ఫోన్లో చిత్రీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై కృష్ణవేణి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి భర్తను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయి.
