ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో విజయనగరం పార్లమెంట్ పరిధిలోని ప్రధాన సమస్యలను ప్రస్తావించామని ఎంపీ Kalisetti Appalanaidu తెలిపారు.
అశోక్ బంగ్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన, నియోజకవర్గంలో హైవే రహదారుల నిర్మాణానికి కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. అలాగే జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగంగా పూర్తి చేయాలని సంబంధిత మంత్రులు, అధికారులతో చర్చించినట్లు వెల్లడించారు.ఇదే సమయంలో Vizzy Stadiumలో పైలెట్ ప్రాజెక్ట్ భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ఎంపీ తెలిపారు.
