వైజాగ్ ఎక్స్‌పోలో 360° వర్చువల్ డూమ్.. సందర్శకులకు థ్రిల్

March 14, 2026 3:57 PM

సాగర తీరంలో నగరవాసులకు కొత్త అనుభూతిని అందించేందుకు Vizag Expo 2026లో 360 డిగ్రీల వర్చువల్ డూమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఎగ్జిబిషన్ Visakhapatnam బీచ్ రోడ్డులోని Andhra University Groundsలో ఏర్పాటు చేశారు.

శుక్రవారం ప్రారంభమైన ఈ వర్చువల్ డూమ్‌లో 360 డిగ్రీల స్క్రీన్‌పై కదిలే చిత్రాలను వీక్షించే ప్రత్యేక అనుభూతి సందర్శకులను అబ్బురపరుస్తోంది. ఒకేసారి 40–50 మంది వరకు వీక్షించగల ఈ డూమ్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.ఎగ్జిబిషన్‌లో యమలోకం, డైనో పార్క్, ఎమ్యూజ్‌మెంట్ రైడ్స్, షాపింగ్, ఫుడ్ స్టాల్స్‌తో పాటు ఈ వర్చువల్ డూమ్ ప్రధాన ఆకర్షణగా మారింది. రాష్ట్రంలో తొలిసారిగా రూ.1.5 కోట్ల వ్యయంతో ఈ 360 డిగ్రీల డూమ్‌ను ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media