రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి Payyavula Keshav తెలిపారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గ్యాస్ కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు.

శనివారం Amaravatiలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి Kinjarapu Atchannaiduతో కలిసి గ్యాస్ సరఫరా పరిస్థితిపై చర్చించారు. వర్చువల్గా మంత్రి Nadendla Manohar పాల్గొన్నారు.గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం కారణంగా నౌకల రవాణా అంతరాయం కలగడంతో సరఫరా వ్యవస్థలో సమస్యలు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. అయితే రియల్ టైం గవర్నెన్స్ (RTGS) ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.ప్రజలకు ఇబ్బంది లేకుండా గ్యాస్ సరఫరా కొనసాగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రులు హెచ్చరించారు. ఆసుపత్రులు, హాస్టళ్లకు గ్యాస్ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
