నక్కపల్లి మండలం వెదుళ్లపాలెం గ్రామంలో Y. S. Sharmila పర్యటించి ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్న కూలీలతో మమేకమయ్యారు. కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె స్వయంగా శ్రామికురాలిగా మారి ఉపాధి పనిలో కొంతసేపు పాల్గొన్నారు. పనులు జరిగే ప్రదేశాల్లో కనీస వసతులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని మహిళలు ఆమె దృష్టికి తీసుకువచ్చారు.అలాగే న్యాయంపూడి, వెదుళ్లపాలెం గ్రామాల వద్ద Andhra Pradesh State Road Transport Corporation బస్సులు ఆగకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు తెలిపారు. దీనిపై స్పందించిన షర్మిల ఆర్టీసీ అధికారులతో ఫోన్లో మాట్లాడి బస్సులు నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేదలకు ఎంతో ఉపయోగకరమని, కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల వల్ల పథకం బలహీనపడుతోందని విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.
