రాజంపేట మండలం ఎర్రబల్లి గ్రామంలో జరిగిన దొంగతనం కేసును మన్నూరు పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో తమిళనాడుకు చెందిన మాబాషా (26), సాయికుమార్ (28)లను అరెస్ట్ చేశారు.
ఫిబ్రవరి 6న తాళం వేసిన ఇంటిలో జరిగిన ఈ దొంగతనంలో సుమారు రూ.9 లక్షల విలువైన 100 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించబడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే మాట్లాడుతూ, అరెస్టైన నిందితులపై గతంలో కూడా పలు దొంగతన కేసులు నమోదైనట్లు వెల్లడించారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
