జిల్లాలో వినూత్నంగా అమలు చేస్తున్న స్మార్ట్ కిచెన్ ప్రాజెక్ట్కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ ప్రాజెక్ట్కు గాను కడప జిల్లా కలెక్టర్ Sridhar Cherukuri ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డుకు ఎంపికయ్యారు.

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించేందుకు స్మార్ట్ కిచెన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆధునిక యంత్రాలు, ఆటోమేషన్, పారదర్శక పంపిణీ విధానం వంటి అంశాల్లో ఈ ప్రాజెక్ట్ విశేష ఫలితాలు సాధించింది.ఈ కృషిని గుర్తించిన Skoch Group, కలెక్టర్ను అవార్డుకు ఎంపిక చేసింది. మార్చి 28న న్యూఢిల్లీలోని India Habitat Centreలో జరిగే 106వ స్కోచ్ సమ్మిట్లో ఈ అవార్డును అందుకోనున్నారు.
