ప్రసిద్ధ Ontimitta Kodandarama Swamy Templeలో వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి వాతావరణంలో ప్రారంభమయ్యాయి. బుధవారం నిర్వహించిన పవిత్ర “హరిధ్రా ఘటనం” కార్యక్రమంతో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు, శ్రీవారి సేవకులు, టీటీడీ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని పసుపు కొమ్ములను దంచే పవిత్ర ఆచారంలో భాగస్వాములయ్యారు. హరిధ్రా ఘటనం ద్వారా సిద్ధం చేసిన పసుపును స్వామివారి స్నపన తిరుమంజనం మరియు తలంబ్రాల తయారీలో వినియోగిస్తారు.

ముందుగా పసుపు కొమ్ములు, పరికరాలను గర్భాలయంలో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహాలక్ష్మి ఆరాధన, శ్రీ సూక్తం పఠనం మధ్య కార్యక్రమం జరిగింది. పసుపు నూరిన అనంతరం సమర్పణ చేసి తాంబూలం అందజేయడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

