జిల్లాలో ఎక్సైజ్ అధికారులు భారీగా నాన్ డ్యూటీ మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. సుమారు రూ.60 లక్షల విలువైన మద్యం బాటిళ్లను శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్ వద్ద నాశనం చేశారు.
గత ఆరు నెలల్లో నమోదైన 103 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 6,859 మద్యం బాటిళ్లు, 44 బీరు బాటిళ్లను పంచుల సమక్షంలో రోలర్తో ధ్వంసం చేశారు.ఈ సందర్భంగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ P. Dasarath మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.అక్రమ మద్యం రవాణాపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా కొనసాగిస్తోందని తెలిపారు.
