చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం మణేంద్రం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని నారా భువనేశ్వరి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా భారీగా స్థానికులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం ఆమె రామకుప్పంలో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తులతో కలిసి పూజలు చేసి, ఆలయ కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యారు.

