Hyderabadలో నటుడు Kishore Kumar G, ప్రధాని Narendra Modi తీరుపై సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు.

అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ ప్రజలు ఐక్యంగా ఉండాలని ప్రధాని చేసిన పిలుపుపై ఆయన విమర్శలు గుప్పించారు. గతంలో కుల, మత విభజనలు పెంచిన తర్వాత ఇప్పుడు ఐక్యత గురించి మాట్లాడడం ఎలా అని ప్రశ్నించారు.ప్రభుత్వ నిర్ణయాలపై కూడా కిషోర్ ప్రశ్నలు లేవనెత్తారు. నోట్ల రద్దు, లాక్డౌన్, అగ్నివీర్ పథకం, వ్యవసాయ చట్టాలు వంటి కీలక నిర్ణయాల విషయంలో ప్రజలు లేదా ప్రతిపక్షాలను సంప్రదించారా అని నిలదీశారు.మణిపూర్ హింస, కాశ్మీర్, లడఖ్ వంటి అంశాలపై ప్రభుత్వ వైఖరిని కూడా ఆయన విమర్శించారు. దేశం ఇప్పటికే ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని, ముందున్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు.ప్రధాని తీరును తీవ్రంగా తప్పుబట్టిన కిషోర్, దేశంలో పాలన విధానాలపై సమీక్ష అవసరమని అభిప్రాయపడ్డారు.
