Khammam జిల్లా Wyraలో ఆర్టీసీ బస్సు–కంటైనర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో 15 మంది గాయపడగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
భద్రాచలం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ముందు వెళ్తున్న కంటైనర్ లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై జరిగిన మరో చిన్న ఘటన కారణంగా వాహనాలు ఒక్కసారిగా ఆగిపోవడంతో, బస్సు డ్రైవర్ ముందున్న లారీని గమనించకుండా ఢీకొట్టినట్లు సమాచారం.ప్రమాదం అనంతరం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్ను పునరుద్ధరించారు. గాయపడిన వారిని అంబులెన్స్ల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
