Proddaturలో ప్రముఖ కవి Puttaparthi Narayanacharyulu 112వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివాలయం కూడలిలో ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వన్టౌన్ సీఐ Kondareddy మాట్లాడుతూ, “శివతాండవం” తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయ కావ్యమని కొనియాడారు. శివుని తాండవాన్ని అద్భుతంగా వర్ణించిన మహాకవి పుట్టపర్తి అని తెలిపారు.పుట్టపర్తి సాహితీ పీఠం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ సభ్యుడు Dr. Tavva Venkataiah మాట్లాడుతూ, పుట్టపర్తి కేవలం పద్యమే కాకుండా వచన సాహిత్యంలో కూడా విశేష కృషి చేశారని అన్నారు.ప్రొద్దుటూరును సాహిత్య కేంద్రంగా తీర్చిదిద్దిన పుట్టపర్తి సేవలను గుర్తుచేసుకుంటూ పలువురు ఆయనకు నివాళులర్పించారు.
