ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా గుర్తిస్తూ చట్టబద్ధ హోదా కల్పించాలని కోరుతూ ఏపీ శాసనసభ శనివారం చారిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది.

ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అధికార కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ సభ్యులు మద్దతు తెలిపారు. ప్రధాన ప్రతిపక్షం YSR Congress Party సమావేశానికి దూరంగా ఉంది.తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అమరావతికి గొప్ప చారిత్రక నేపథ్యం ఉందని, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ఇది ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. గతంలో రాజధానుల మార్పుల వల్ల రాష్ట్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని పేర్కొన్నారు.రాజధాని నిర్మాణంలో రైతుల త్యాగాన్ని గుర్తుచేసిన సీఎం, అమరావతిని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని సంకల్పం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రాజధాని మార్పుపై గందరగోళం లేకుండా చట్టబద్ధ రక్షణ అవసరమని స్పష్టం చేశారు.సభ ఆమోదించిన ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు.
