ఆంధ్రప్రదేశ్లోని Visakhapatnamలో దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రియురాలిని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్లో దాచిన నేవీ టెక్నీషియన్ కేసు కలకలం రేపుతోంది.

నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్న రవీంద్ర (35)కు మౌనిక (29)తో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారింది. ఇటీవల భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో మౌనికను ఇంటికి పిలిచిన రవీంద్ర, వాగ్వాదం నేపథ్యంలో ఆమెను హత్య చేసినట్లు సమాచారం.తర్వాత సాక్ష్యాలను చెరిపివేయడానికి మృతదేహాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్లో దాచినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించగా, కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
