పెంచలకొనలో శ్రీవారికి వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభం

March 31, 2026 11:46 AM

రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకొనలో శ్రీపెనుశీల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం అనుజ్ఞ, విశ్వక్సేనారాధన, పుణ్యహవాచనం, రక్షాబంధనం, అంకురార్పణ హోమం వంటి పూజలు ప్రధానార్చకులు, వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య వైభవంగా నిర్వహించారు.వసంతోత్సవాల సందర్భంగా మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు స్వామివారి నిత్యకల్యాణం రద్దు చేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media