నరసరావుపేట మండలం కేసానుపల్లి గ్రామంలో గంజాయి విక్రయాలపై పోలీసులు దాడులు నిర్వహించి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

టీట్కో గృహాల వద్ద గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేపట్టగా, నిందితుల వద్ద నుంచి సుమారు కిలోన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన వారంతా పట్టణంలోని పలు ప్రాంతాలకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. గంజాయి విక్రయ ముఠా వెనుక మరికొందరు ఉన్నారా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
