ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ కి సొంతం దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వినిపిస్తోంది. యుద్ధం ఆపేసి, బందీలను సురక్షితంగా విడిపించాలని డిమాండ్ చేస్తున్నారు. వేలాది మంది ఇజ్రాయెల్ ప్రజలు రోడ్లపైకి వచ్చి భారీ నిరసనలు చేపట్టారు. నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యుద్ధం వల్ల తమ దేశం ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతింటోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం పేరుతో ఖజానా ఖాళీ చేస్తున్నారని మండిపడుతున్నారు.
