నెల్లూరు జిల్లా రాపూరులో డాక్టర్ B. R. Ambedkar 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
రాపూరు పోలీస్ స్టేషన్ ఆవరణలోని గ్రంథాలయం ముందు ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ మండల అధ్యక్షుడు దూడల పెంచలయ్య ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సమానత్వం మరియు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అంబేద్కర్ చేసిన సేవలు అమూల్యమని కొనియాడారు. ఆయన రచించిన రాజ్యాంగం దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తోందని పేర్కొన్నారు.
