Nara Lokesh తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల్లో పలు క్రీడా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గొల్లవానిగుంటలో రూ.10.10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ అకాడమీలను ప్రారంభించి క్రీడాకారులతో మాట్లాడారు. మాజీ భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ Mithali Rajతో కలిసి కొద్దిసేపు క్రికెట్ ఆడుతూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు.అదేవిధంగా శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో కరణం మల్లీశ్వరి వెయిట్లిఫ్టింగ్ అకాడమీకి శంకుస్థాపన చేసి, జూనియర్ బాక్సింగ్ రింగ్ను ప్రారంభించారు. గూడూరు, సూళ్లూరుపేట, రేణిగుంట ప్రాంతాల్లో క్రీడా వికాస కేంద్రాలకు కూడా శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమంలో PV Sindhu, Kidambi Srikanth సహా పలువురు ప్రముఖ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టులు ప్రాంతంలో క్రీడా అభివృద్ధికి దోహదం చేస్తాయని మంత్రి తెలిపారు.
