జాతీయ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా చోడవరం అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలు మరియు గ్యాస్ లీకేజీ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిమాపక అధికారి రామస్వామి నాయకత్వంలో పట్టణంలోని అపార్ట్మెంట్ల నివాసితులకు అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపార్ట్మెంట్లు, పాఠశాలలు, ఆస్పత్రులు మరియు బహుళ అంతస్తుల భవనాల్లో అగ్నిమాపక సిలిండర్లు ఏర్పాటు చేయడం తప్పనిసరి అని సూచించారు. ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు అత్యంత ముఖ్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది మరియు స్థానికులు పాల్గొన్నారు.
