రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి Kolusu Parthasarathy తెలిపారు.

ఆదివారం Chiralaలోని రామాపురం బీచ్ను సందర్శించిన మంత్రి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ బాలాజీ, జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్, ఎమ్మెల్యే మూల కొండయ్యతో కలిసి పరిస్థితులను పరిశీలించారు.పర్యాటకులను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసిన పరామోటర్ ఎయిర్ సఫారీని మంత్రి ప్రారంభించారు. సముద్రతీర ప్రాంతాలను అభివృద్ధి చేసి మరింత మంది పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు.
