నెల్లూరు జిల్లా Rapur మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం Penchalakona Templeలోని శ్రీ పెనుశీల లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నిత్య అన్నదాన పథకానికి విరాళం అందింది.
బెంగళూరుకు చెందిన హార్దిక్, శశికళ ప్రకాష్ దంపతులు రూ.1,00,116 నగదు విరాళాన్ని దేవస్థానం సిబ్బందికి అందజేశారు. ఈ విరాళం నిత్య అన్నదాన పథకం అభివృద్ధికి ఉపయోగపడనుంది.ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు దాతలకు ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శనం కల్పించి, శేష వస్త్రాలు మరియు ప్రసాదం అందజేశారు.
