నెల్లూరు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు లాడ్జీలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ Dr. Ajitha Vejendla ఆదేశాల మేరకు ఈ డ్రైవ్ చేపట్టారు.
Nellore జిల్లా వ్యాప్తంగా జరిగిన ఈ తనిఖీలలో లాడ్జీల్లో దిగిన వారి వివరాలు, ఐడీ ప్రూఫ్లు, రిజిస్టర్ నమోదు వివరాలను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు పోలీసులు తెలిపారు.లాడ్జి యజమానులు ప్రతి అతిథి పూర్తి వివరాలు నమోదు చేయాలని, సరైన గుర్తింపు పత్రాలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని హెచ్చరించారు.ప్రజల భద్రత కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే 100/112 లేదా కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాలని సూచించారు.
