అప్పుడు తెలుగు సినిమా హీరోయిన్.. ఇప్పుడు అతి దారుణమైన మరణం

May 19, 2026 6:55 AM

33 ఏళ్ల ట్విషా శర్మ హత్య కేసులో సీసీటీవీ ఫుటేజ్ ఒక నాటకీయమైన కొత్త కోణాన్ని జోడించింది. ఆమె మరణానికి కొద్దిసేపటి ముందు భోపాల్‌లోని తన ఇంటి పైకప్పు వైపు నడుచుకుంటూ వెళ్లడం, ఆ తర్వాత ఆమె భర్త, మరో ఇద్దరు ఆమెను మెట్లపై నుండి కిందకు తీసుకురావడం ఈ ఫుటేజ్‌లో కనిపిస్తుంది. వైరల్ ఫుటేజ్ ప్రకారం, ట్విషా టెర్రస్ మెట్లు ఎక్కడం ఇందులో రికార్డ్ అయింది. సుమారు గంట తర్వాత, ఆమె భర్త సమర్థ్ సింగ్, మరో ఇద్దరు వ్యక్తులు ఆమె మృతదేహాన్ని మెట్ల మీదుగా కిందకు తీసుకురావడం కనిపిస్తుంది.

ట్విషా శర్మది ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా. 2012లో మిస్‌ పుణెగా నిలిచిన ఆమె తెలుగులో 2021లో వచ్చిన ‘ముగ్గురు మొనగాళ్లు’ చిత్రంలో నటించారు. పలు బ్రాండ్లకు ప్రచారకర్తగానూ కనిపించారు. ఎంబీఏ చదివిన ఆమె పెళ్లికి ముందు ఓ మార్కెటింగ్ కంపెనీలో పనిచేశారు. ఒక డేటింగ్ యాప్‌లో పరిచయమైన లాయర్‌ సమర్థ్‌ సింగ్‌ను ప్రేమించి 2025, డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన ఐదు నెలల తర్వాత మే 12న ట్విషా శర్మ అత్తవారింట్లో ఉరివేసుకొని మృతి చెందినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆమెను చంపేశారనే అనుమానాలు బలపడ్డాయి. మృతి చెందడానికి ముందు తన తల్లి, స్నేహితురాలికి ట్విషా పలు సందేశాలు పంపినట్లు తెలుస్తోంది. తాను వేధింపులు, మానసిక క్షోభ అనుభవిస్తున్నానని, తన జీవితం నరకంలా మారిందని ఏప్రిల్ 30న తన తల్లికి సందేశం పంపింది. ‘వాళ్లు నన్ను బతకనివ్వరు. ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్లండి. ఏదీ సరిగా జరగడం లేదు’ అని మళ్లీ మే 7న మరో మెసేజ్‌ పంపింది. ట్విషా శర్మ భర్త లాయర్ కాగా.. అత్త గిరిబాలా సింగ్ విశ్రాంత న్యాయమూర్తి. ప్రస్తుతం భోపాల్‌లోని కటారా హిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదైంది. పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media