Alwal,ఎంఈఎస్ కాలనీలో విషాదం.. విద్యుత్ తీగలకు తాకిన కొమ్మలు
భార్య, ముగ్గురు కుమారులను విడిచిపోయిన సూర్యనారాయణ
హైదరాబాద్: Alwal లో బుధవారం విషాద ఘటన చోటు చేసుకుంది. ఎంఈఎస్ కాలనీలో ఓ అపార్ట్మెంట్ ముందు చెట్టు కొమ్మలు కత్తిరిస్తుండగా 45 ఏళ్ల దినసరి కూలీ విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.
మృతుడిని సూర్యనారాయణగా గుర్తించారు. అపార్ట్మెంట్ ముందు పెరిగిన చెట్టు కొమ్మలను కత్తిరించేందుకు ఆయనను పిలిచారు. ఈ క్రమంలో కత్తిరించిన కొమ్మలు సమీపంలోని విద్యుత్ తీగలకు తాకడంతో ఆయనకు తీవ్ర విద్యుదాఘాతం తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
స్థానికులు సమాచారం ఇవ్వడంతో అల్వాల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
సూర్యనారాయణ దినసరి కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.
ఈ ఘటనపై అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



