మహిళల 4×100మీ రిలేలో భారత్‌కు స్వర్ణం..

June 22, 2026 11:43 AM
Indian women's asia relay team celebrates gold medal victory.

ASIAN రిలేస్ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శన..

ASIA: చైనాలోని షావోషింగ్‌లో జరిగిన ASIAN రిలేస్ ఛాంపియన్‌షిప్ రెండో ఎడిషన్ చివరి రోజు భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. మహిళల 4×100 మీటర్ల రిలేలో భారత జట్టు స్వర్ణ పతకం సొంతం చేసుకుంది.

శ్రాబణి నందా, ఎస్‌ఎస్ స్నేహ, సుదేశ్నా శివాంకర్, తమన్నాతో కూడిన భారత క్వార్టెట్ 43.85 సెకన్లలో రేసును పూర్తి చేసింది. ఇది ఈ సీజన్‌లో ఆ జట్టు నమోదు చేసిన అత్యుత్తమ టైమ్‌గా నిలిచింది.

మిక్స్‌డ్ 4×400 మీటర్ల రిలేలో కూడా భారత్ మరో పతకం ఖాతాలో వేసుకుంది. తీర్థేశ్ శెట్టి, పూవమ్మ ఎంఆర్, భరత్ శ్రీధర్, నీరూ పఠాక్‌తో కూడిన భారత జట్టు 3:17.06 సెకన్లలో రేసును పూర్తి చేసి రజత పతకం గెలుచుకుంది.

అంతకుముందు జరిగిన మిక్స్‌డ్ 4×100 మీటర్ల రిలేలో భారత్ కాంస్య పతకం సాధించింది. ప్రణవ్ గౌరవ్, తమన్నా, అనిమేష్ కుజూర్, ఎస్‌ఎస్ స్నేహ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media