రాయదుర్గం నాలెడ్జ్ సిటీ ప్రాంతంలో అర్థరాత్రి ఘర్షణ
గన్ చూపించి బెదిరించిన వ్యక్తి.. పబ్లో ధ్వంసం, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
హైదరాబాద్: రాయదుర్గం నాలెడ్జ్ సిటీ ప్రాంతంలో ఉన్న ఓ పబ్( Raidurgam Pub )లో ఆదివారం అర్థరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
చిన్న విషయంపై రెండు వర్గాల మధ్య ప్రారంభమైన వాగ్వాదం క్రమంగా తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనతో అక్కడ ఉన్న కస్టమర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సమాచారం ప్రకారం, వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో ఓ వ్యక్తి తన వద్ద ఉన్న గన్ను బయటకు తీసి ఎదుటి వారిని బెదిరించినట్లు తెలిసింది.
దీంతో Raidurgam Pub లో ఒక్కసారిగా కలకలం రేగింది. భయపడిన కస్టమర్లు తమ ప్రాణాల రక్షణ కోసం బయటకు పరుగులు తీశారు.
ఆ తర్వాత నిందితుడు, అతనితో ఉన్న మరో వ్యక్తి పబ్లో హంగామా చేసినట్లు సమాచారం. మద్యం బాటిళ్లను ధ్వంసం చేయడంతో పాటు టేబుళ్లను పడగొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.
Pub యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో రాయదుర్గం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనలో పాల్గొన్న వారిని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. అలాగే ఘటనలో ఉపయోగించిన గన్కు చట్టబద్ధమైన లైసెన్స్ ఉందా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు.



